రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడానికి రాష్ట్ర పురపాలక మంత్రి కేటీఆర్ రేపు కామారెడ్డి జిల్లా కేంద్రానికి రానున్నారు. పట్టణంలో జరుగుతున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మంత్రి కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. ఉదయం 10 గంటలకు 24, 25 వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొననున్నారు.
11 గంటలకు జిల్లా ఆస్పత్రి సందర్శన, 11:15 గం.లకు తహసీల్దార్ కార్యాలయం వద్ద మరుగుదొడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన, 11:30 గం.లకు జిల్లా గ్రంథాలయ ప్రారంభోత్సవం, 11:45 రాశివనం సందర్శన, 12:00 జిల్లా కేంద్రంలో ఆరు లైన్ల రోడ్డు పనులకు శంకుస్థాపన, 12:30 హోసింగ్ బోర్డు కాలనిలో మొక్కలు నాటే కార్యక్రమం, మధ్యాహ్నం 1 గం.లకు సత్య గార్డెన్లో వార్డు కమిటీలతో సమావేశం నిర్వహించనున్నారు.
మంత్రి పర్యటనకు అధికారులు పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తోంది.