హైదరాబాద్ లో సినీ పరిశ్రమ విస్తరణకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నటుడు చిరంజీవి, నాగార్జులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని సినీ నటుడు చిరంజీవి నివాసంలో జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చాయి.
సీనియర్ నటులు చిరంజీవి, నాగార్జున లతో మంత్రి సమావేశం కావడం మంచి పరిణామమని సినీ పరిశ్రమ స్పందించింది. పెండింగులో ఉన్న పలు సమస్యలు పరిష్కారం అయ్యేందుకు దీనితో మార్గం ఏర్పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.