అంతర్జాతీయ ఈత పోటీలలో పాల్గొనేందుకు వెళుతున్న నరసరావుపేట క్రీడాకారుడిని నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు అభినందించారు. ఈ నెల 5వ తేదీ నుండి 11వ తేదీ వరకు దుబాయ్ లో 3rd International Masters Swimming Championship – 2020 జరగబోతున్నది.
ఈ పోటీలలో భారతదేశం తరపున నరసరావుపేట ఎస్.ఎస్ & ఎన్ కళాశాల ఈత శిక్షకుడు షేక్ ఖాజా మొహిదీన్ పాల్గొనబోతున్నాడు. ఈ పోటీలలో భారత్ తో బాటు దుబాయ్, ఓమన్ దేశాల ఈత క్రీడాకారులు పాల్గొంటున్నారు. ఈ పోటీలో పాల్గొనడానికి నేడు దుబాయ్ కి బయలుదేరుతున్న షేక్ ఖాజా మొహిద్దీన్ అరవింద బాబు అభినందించారు. దేశానికి పతాకం తీసుకురావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు.