మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు మునుగోడు వెళ్లిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ తో పాటు తన వ్యక్తిగత వాహనాన్ని ఎన్నికల అధికారులు, పోలీస్ లు తనిఖీ చేశారు. అందుకు మంత్రి పువ్వాడ వారికి సహకరించి, తనిఖీ లు పూర్తి అయ్యే వరకు వేచి ఉన్నారు. ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో భాగంగా తనిఖీలు సాధారణం అని, వారికి సహకరించాలి బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం ఎన్నికల ప్రచారంలో పాల్గోన్నారు.
previous post