31.7 C
Hyderabad
May 2, 2024 09: 14 AM
Slider ఖమ్మం

వీఆర్ఏ వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు ప్రభుత్వమే కారణం

#vravenkateswarlu

మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డివిజన్ ఊట్లపల్లి గ్రామం గ్రామ రెవెన్యూ సహాయకుడు కంచర్ల వెంకటేశ్వర్లు కుటుంబాన్ని నేడు ఖమ్మం జిల్లా విఆర్ఏ ల JAC చైర్మన్ చల్లా లింగరాజు పరామర్శించారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటు, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ఖమ్మం వీఆర్ఏ జేఏసీ తెలియచేసింది.

ఈ ఆత్మహత్యకు కెసిఆర్ ప్రభుత్వం బాధ్యత వహించి వారి కుటుంబానికి ఎక్సగ్రెసియా చెల్లించాలని, వారి కుటుంబం లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగము ఇవ్వాలని డిమాండ్ చేసారు. విఆర్ఏ లకు సీఎం కేసీఆర్ ప్రకటించిన పేస్కేల్, పదోన్నతలు, వారసత్వ ఉద్యోగాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 13 ఛలో అసెంబ్లీ కి రాష్ట్ర నలుమూలల నుండి భారీగా విఆర్ఏ లు తరలి రావాలని ఆయన కోరారు.

వెంకటేశ్వర్లు కుటుబానికి ఆర్థిక సహాయం అందించినట్లు చల్లా లింగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ట్రీజరర్ ఉపేందర్,రూరల్ మండల అధ్యక్షులు చందుమియా, వీరయ్య,అజయ్, మురళి, ఇబ్రహీం, నాగరాజు, ముత్తయ్య, రామారావు, గోపి, నరేష్, వెంకట్ కృష్ణ, సంపత్, జ్యోతి బాసు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు అకాడమీ సాయం

Satyam NEWS

కౌంటింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులు ఉండాలి

Satyam NEWS

ప్రజల పై భారం మోపే జీవోలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

Leave a Comment