తెలంగాణ సోషల్ వెల్ ఫెర్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీచే విద్యా సంస్థల్లో సమ్మర్ క్యాంపుల నిర్వహణపై రూపొందించిన పోస్టర్ ను ఐడిఓసి లోని అదనపు కలెక్టర్ చాంబర్ లో ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్ ఆవిష్కరించారు. ఇట్టి సమ్మర్ క్యాంపులో సాంస్కృతం, క్లాసికల్ డ్యాన్స్, థియేటర్ ఆర్ట్, బ్యూటీ కేర్ పై శిక్షణ ఇవ్వనున్నట్లు, ఇట్టి క్యాంపు 22, ఏప్రిల్ నుండి 6, మే వరకు నిర్వహించబడతాయని అదనపు కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఆర్డీవో రవీంద్రనాథ్, జిల్లా పౌరసరఫరాల అధికారి రాజేందర్, సాంఘీక సంక్షేమ శాఖ ఆర్సీవో ప్రత్యూష, కూసుమంచి సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాల ప్రిన్సిపాల్ ఎం. రమేష్ బాబు, క్యాంపు కో-ఆర్డినేటర్ పివి పద్మావతి, క్యాంపు అసిస్టెంట్ డి. మధుశ్రీ తదితరులు పాల్గొన్నారు.
previous post