33.2 C
Hyderabad
May 4, 2024 01: 58 AM
Slider చిత్తూరు

చిన్నారిని ఆదుకున్న మంత్రి ఆర్కే రోజా

#Minister RK Roja

బైలియరి అట్రిసియం తో బాధపడుతున్న ఒక చిన్నారిని మంత్రి ఆర్కేరోజా ఆదుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా వారి పాప ఆపరేషన్‌ కోసం అవసరమైన రూ. 22లక్షల నగదును మంత్రి మంజూరు చేయించారు. బుధవారం నగరిలోని క్యాంపు కార్యాలయంలో చిన్నారి తండ్రి డాక్టర్ మహేష్ కి ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కును అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఆర్కేరోజా మాట్లాడుతూ పాపకు అవసరమైన వైద్యం చేయించాలని రేలా ఇంస్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్, చెన్నై ఆసుపత్రి నిర్వాహకులతో సైతం మాట్లాడామని తెలిపారు. పాప ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుతుందని, క్షేమంగా వెళ్ళి సంపూర్ణ ఆరోగ్యంతో తమ చిన్నారి రుద్రాంక్షి తో కలిసి రావాలని దీవించారు. డాక్టర్‌ గా ఎందరినో ఆదుకున్న మీ పాపకి మంచి జరుగుతుందని వారికి ధైర్యం చెప్పి చెక్ ను అందజేశారు.

Related posts

అమృతమే

Satyam NEWS

అమ్మ భాష అయిన తెలుగు భాషను కాపాడుకుందాం

Satyam NEWS

ఛత్తీస్‌గఢ్‌లో నలుగురు మావోయిస్టులు హతం

Satyam NEWS

Leave a Comment