ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలోని జగర్గుండా ఏరియాలో అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి.
ఈ ఎదరుకాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు బస్తర్ ఐజీ పి సుందర్ రాజ్ స్పష్టం చేశారు.
ఘటనాస్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన ఆయుధాలను, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.