38.2 C
Hyderabad
April 29, 2024 14: 51 PM
Slider కరీంనగర్

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ కుట్ర

#BJP conspiracy

తొమ్మిదిన్నర ఏళ్లలో టెన్త్ మొదలు పీజీ వరకూ, కానిస్టేబుల్ మొదలు డిప్యూటీ కలెక్టర్ వరకూ ఎన్నో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రభుత్వం తెలంగాణ అని, కేవలం అధికార దాహంతో శాంతితో ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి, తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించి తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ పై అప్రతిష్ట చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఈరోజు కరీంనగర్ లోని తన కార్యాలయంలో మిడియా సమావేశం నిర్వహించారు. అధికారం కోసం బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలే రాష్ట్రంలో తాజా అలజడికి కారణమన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి చట్టాన్ని గౌరవించని వ్యక్తి బండి సంజయ్ అని, తనకు వచ్చిన ప్రశ్నాపత్రంపై మొదట పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత లేదా అని బండి సంజయ్ ని ప్రశ్నించారు మంత్రి గంగుల.

బీజేపీ కి సంబంధించిన గ్రూపులు, సోషల్ మీడియాలో వేగంగా వైరల్ చేయడం వెనుక బీజేపీ కుట్ర స్పష్టంగా బైటపడుతుందన్నారు. లీక్ కాకుండా బయటకొచ్చిన పేపర్ లీకేజీ అంటూ వైరల్ చేయడం కుఠిల రాజకీయాలకు నిదర్శనమని. బీజేపీ గ్రూపుల నుండే ఎందుకు ఎక్కువగా సర్క్యులేట్ అయ్యాయని ప్రశ్నించారు. ఈరోజు లక్షలాది తెలంగాణ తల్లిదండ్రుల, విద్యార్థుల ఉసురు ఖచ్చితంగా బీజేపీకి, బండి సంజయ్ కి తగులుతుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ జెండా పట్టే వాళ్లు లేరని ఆ అక్కసుతోనే యువతను బీజేపీ వైపు మలుచుకోవాలని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. అందుకోసమే గతంలో స్వయంగా బండి సంజయ్ ఎన్నికల టైంలో ఉద్యోగాలెలా ఇస్తారని ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేసారు. లీకేజీ ఘటనల్లో ప్రభుత్వానికి ఎక్కడా సంబందం లేదన్న మంత్రి గత తొమ్మిదేళ్లుగా ఎలాంటి ఘటనలు లేవని గుర్తుచేసారు.

తెలంగాణను మరో బీహార్గా చేయడానికి బండి సంజయ్, బీజేపీ కుట్రపన్నిందని, బీహార్ సంస్కృతిని రాష్ట్రానికి తెస్తూ గుండాయిజాన్ని, రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తుందన్నారు.ఈ నీచ కుట్రలతో బండి సంజయ్ కరీంనగర్ పరువుతీస్తున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వ క్రుషితో వేలాది కోట్ల ఇన్వెస్ట్మెంట్లు, వేలాది ఉపాధి అవకాశాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, వలసల రివర్స్, పాడిపంటల్లో రికార్డులు, నీళ్లు, నిధులు, కరెంటు తీసుకొస్తుంటే, గతంలో కాంగ్రెస్ అభద్రతా బావం స్రుష్టించినట్టే ఇప్పుడు బీజేపీ చేస్తుందన్నారు. అభివృద్ధిలో పోటీపడాలి కానీ ఇలాంటి విషసంస్కృతిని తీసుకురావడం సమంజసమేనా అని బండిని ప్రశ్నించారు. కరీంనగర్ డెవలప్మెంట్ లో, సీసీరోడ్లలో, సెంట్రల్ లైటింగ్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ తీసుకురావడంలో ఇతరత్రా అభివృద్ధి పనుల్లో పోటీ పడదామని, ఇలాంటి జుగుప్సాకరమైన సంఘటనల్లో కాదన్నారు మంత్రి గంగుల. బోరం ప్రశాంత్ కు టీఆర్ఎస్ పార్టీల నేతలతో సంబందాలు ఉన్నాయని మాట్లాడుతున్న బీజేపీ నేతలు, మరి ప్రశ్నాపత్రాలను నిందితుడు కేవలం బండి సంజయ్కే ఎందుకు పంపారని ప్రశ్నించారు. బీజేపీ లీకేజీ మిషన్ సక్సెస్ అనే సంకేతాన్ని బండిసంజయ్ కు పంపడం కాక ఇది మరోటి కాదన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఈ సమావేశంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామక్రుష్ణారావు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

Related posts

డ్రయివింగ్ లైసెన్సు లేకపోతే జైలు గ్యారెంటీ

Satyam NEWS

సామాన్యుడికి న్యాయం జరగాలంటే సీఎంగా జగన్ ఉండాలి

Satyam NEWS

భూకంపాల చరిత్ర ఇది: ఎన్నో దేశాలలో భయం భయం…

Satyam NEWS

Leave a Comment