39.2 C
Hyderabad
May 4, 2024 19: 12 PM
Slider ఖమ్మం

శ్రీనివాస రావు భౌతికకాయానికి నివాళులు అర్పించిన మంత్రులు

#puvvada

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామం ఎర్రబొడు ఘటనలో మృతి చెందిన అటవీ అధికారి శ్రీనివాసరావు మృతదేహాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సందర్శించి భౌతికకాయానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి ప్రభుత్వం తరుపున ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు. శ్రీనివాస రావు ఆత్మ‌కు శాంతి కలగాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన శ్రీనివాసరావు కుటుంబానికి ముఖ్యమంత్రి కేసీఅర్ ప్రభుత్వం తరుపున రూ.50 లక్షలు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఇంటి స్థలం ప్రకటించిందన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కుటుంబ సభ్యులకు  భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు రెగా కాంతారావు, రాములు నాయక్, మెచ్చ నాగేశ్వర రావు, ఎమ్మెల్సీ తాత మధు, సి‌ఎం ఓ  సెక్రటరీ స్మితా సబర్వాల్, హరితాహరం ఓఎస్ డి  ప్రియాంక వర్గీస్, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, అటవీ శాఖ వున్నతాధికారులు దొబ్రియల్,  లోకేష్ జైస్వాల్, ఖమ్మం కలెక్టర్ VP గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అనుదీప్ , కొత్తగూడెం SP వినీత్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

Related posts

తెలుగు మ‌హిళా ఆధ్వ‌ర్యంలో వంట-వార్పు..!

Sub Editor

నరసరావుపేటలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

రిజైన్ స్కై బార్ పై ఎక్సయిజ్ పోలీసు పంజా

Satyam NEWS

Leave a Comment