తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నరసరావుపేట నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు పార్టీ జెండా ఎగురవేసి,ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
38 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాష్ట్రాన్ని దేశాన్ని కరోనా మహమ్మారి నుండి కాపాడుకుందాం అని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా వారి కుటుంబ సభ్యులతో గడుపుతూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నరసరావుపేట నియోజకవర్గ ప్రజానికానికి, తెలుగు ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో కడియాల రమేష్, బండారుపల్లి విశేశ్వర్ రావు పాల్గొన్నారు.
ఇంకా వెన్న బలకోటి రెడ్డి,వల్లెపు నాగేశ్వరరావు, వాసిరెడ్డి రవి,మక్కెన ఆంజనేయులు,శేఖర్, ప్రసాద్,బాషా, సుభాని, ఏ వి ర్,మోహన్ రావు,పీర్ ఇతర నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.