38.2 C
Hyderabad
May 5, 2024 19: 09 PM
Slider హైదరాబాద్

మూసీ నదిలో మహిళ మృతదేహం లభ్యం

#musiriver

హైదరాబాద్ గాంధీనగర్ నాలాలో గల్లంతైన మహిళ మృతదేహం మూసీనదిలో కొట్టుకొచ్చింది. మూసీ పరివాహక ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ఆ మహిళను కవాడిగూడ డిఎస్‌నగర్‌కు చెందిన వెంకటేశ్‌ భార్య లక్ష్మి(55)గా గుర్తించారు. లక్ష్మి ఆచూకీ తెలియటం లేదని ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే  ఇవాళ ఆమె మృతదేహం కుళ్లిన స్థితిలో మూసీ ఒడ్డున లభ్యమైంది. పోస్టుమార్టం అనంతరం లక్ష్మి మృతదేహన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Related posts

అమెరికా అధ్యక్షుడిపై నెగ్గిన అభిశంసన తీర్మానం

Satyam NEWS

మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ టైటిల్ సాంగ్ 23న విడుదల

Satyam NEWS

“మాతృదేవోభవ”  చిత్రం నాకు గర్వకారణం

Satyam NEWS

Leave a Comment