కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో వందలాది మంది
శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా విజయనగరంలోని కామన్నవలస శ్రీ స్వామి రామానంద యోగజ్ఞానాశ్రమంలో శ్రీకృష్ణాష్ఠమి వేడుకలు మొదలయ్యాయి. ఈ రాత్రి 12 గంటలకు శ్రీకృష్ణుని జననం అవ్వడంతో ఆశ్రమంలో పూజలు నిర్వహించనున్నారు నిర్వాహకులు. అయితే మధ్యాహ్నం మీటింగ్ హాలులో ఆశ్రమ పీఠాధిపతి బ్రహ్మశ్రీ డా.శ్రీగురూజీ అయిన అంతర్ముఖానందుల వారిచే ఆధ్యాత్మిక ఉపన్యాసం జరిగింది. ఏకధాటిగా నాలుగున్నర గంటల పాటు శ్రీగురూజీ పద్మాసనం వేసుకుని భగవద్గీత 18 అధ్యాయాలను అనర్గళంగా పద్యాలు, శ్లోకాలతో భక్తులకు తెలియజెప్పారు. ఈ వేడుకలకు దాదాపు 500 మంది శిష్యులు హాజరు కాగా ఒక్క తిరుపతి నుంచే 35 మంది హాజరై ఉపదేశం పొందారు. అలాగే బెంగళూర్, విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచీ కూడా శిష్యులు హాజరయ్యారు.