కర్నూలు జిల్లా ఆదోనిలో విషాదం చోటు చేసుకుంది. పట్టణంలోని శ్రీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న కానిస్టేబుల్ సందీప్ ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదోని డిఎస్పి కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా సందీప్ వీధులు నిర్వర్తిస్తున్నాడు.
విషయం తెలుసుకున్న టూ టౌన్ పోలీసులు సంఘటన చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్ సందీప్ కు భార్య హేమలత , కూతురు సహస్ర ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు. భర్త మృతితో భార్య, కూతురు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.