38.2 C
Hyderabad
May 3, 2024 21: 26 PM
Slider చిత్తూరు

500 కుటుంబాలకు సాయం అందించిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే

#Srikalahasthi MLA

లాక్ డౌన్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను నేనున్నాను అంటూ ఆదుకుంటున్నారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి. నేడు ఆయన దాదాపు 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

శ్రీకాళహస్తి మండలం, ఉరందుర్ గ్రామం, ST కాలనీ, అరుంధతి వాడలోని నిరుపేదలు ఎమ్మెల్యే చేసిన సాయాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి మండల నాయకులు శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ దాదాపు 30 సంవత్సరాలుగా మంత్రిగా, ఎమ్మెల్యే గా చేసిన బొజ్జల కుటుంబం ఈ క్లిష్ట సమయంలో ప్రజలతో లేకుండా పోయిందని అన్నారు.

శ్రీకాళహస్తి ప్రజలను ఆపద సమయంలో విడిచిపెట్టి హైదరాబాద్ వెళ్లిపోయిన బొజ్జల కుటుంబం వారు కనీసం తమ సొంత గ్రామం (ఉరందుర్) లో ఉన్న పేద ప్రజలకు కూడా సహాయం చేయకపోవడం చాలా బాధాకరం అన్నారు.

అలాగే కుంటిపూడి, కొత్తూరు, పాపన్నపల్లి, భీమవరం, వాంపల్లి, ఆంజనేయపురం, గోవిందరావుపల్లి, మామిడిగుంట, ఏర్పేడు మండలంకు సంబంధించిన రాజులపాళ్యంలో ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి నిత్యావసర సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

Related posts

సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి

Murali Krishna

పర్మిషన్ లేకుండా షూటింగ్ లో పాల్గొన్న మహేష్

Satyam NEWS

కేతేపల్లిలో  ఏటీఎం ఏర్పాటు చేయాలి

Satyam NEWS

Leave a Comment