సినీ హిరో మహేష్ బాబు అభిమానులతో ఏర్పాటు చేసుకున్న ఫోటో షూట్ వద్ద అపశృతి చోటు చేసుకుంది. నేడు లింగంపల్లి ఆల్విన్ ఫ్యాక్టరీ వద్ద మహేష్ బాబుతో ఆయన అభిమానుల ఫోటో షూట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనుకున్న దానికన్నా అభిమానులు అధిక సంఖ్యలో రావడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
నిర్వాహకులు ఈ ఫొటో షూట్ కోసం పోలీస్ పర్మిషన్ కూడా తీసుకోలేదు. షూటింగ్ కు పర్మిషన్ లేకపోవడంతో చందానగర్ పోలీస్ లు షూటింగ్ నిలిపేశారు. షూట్ కోసం అభిమానులు ఎక్కువగా రావడం తో జరిగిన తోపులాటలో కొందరు గాయపడ్డారు. ఈ నేపధ్యంలో మహేష్ బాబు షూటింగ్ మధ్య నుంచే వెళ్లిపోయాడు.