వనపర్తి జిల్లా పానగల్ మండల కేతేపల్లి గ్రామంలో ఉన్న ఎస్బిఐ బ్యాంక్ లోఎటిఎం ఏర్పాటు చేయాలని వార్డు సభ్యుడు వెంకటేష్, యువకులు రాజశేఖర్ ఆధ్వర్యంలో బ్యాంక్ మేనేజర్ పవన్ కుమార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేతేపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల 10 గ్రామాల ప్రజలు ఏటీఎం లేక పానుగల్ లేదా వనపర్తి కి 23 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుందన్నారు.ఏటీఎం కొరకు ఆల్రెడీ సెటరు ఉందని ఏటీఎం ఏర్పాటు చేసి వినియోగంలోకి తీసుకురావాలని గ్రామాల ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ జైపాల్ రెడ్డి, వార్డు సభ్యుడు మౌలాలి, రాము, నాగార్జున్, అంబేద్కర్ హామాలి సంఘం నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్