భావితరాలకు మనం ఇచ్చే కానుక ఒక అందమైన మొక్క అని హైదరాబాద్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరవ విడత హరిత హారం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా వివిధ ప్రాంతాలలో ఆయన మొక్కలు నాటుతున్నారు.
పట్టణాలు, నగరాలు కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న నేపథ్యంలో ఏ మాత్రం స్థలం ఉన్నా మొక్కలు నాటాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని మాగంటి గోపీనాథ్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత హారం కార్యక్రమాన్ని చేపట్టడం ఆయన దూరదృష్టికి నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు.
భావితరాలను దృష్టిలో ఉంచుకుని హరిత తెలంగాణ సాధించేందుకు ఆయన కంకణం కటకొన్నారనిరని మాగంటి అన్నారు. రాష్ట్రంలో చేపడుతున్న నీటిపారుదల ప్రాజెక్టులతో ఇప్పటికే తెలంగాణ సస్యశ్యామలంగా మారిందని, హరితహారం కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా చేపడితే తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.