గుంటూరు జిల్లా నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం మాజీ మంత్రి నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మానవ వనరుల అభివృద్ధి విభాగం రాష్ట్ర సభ్యులు వల్లెపు నాగేశ్వరరావు, నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రాపర్ల జగ్గారావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్టేడియం డెవలప్మెంట్ సొసైటీ అడ్వైజర్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మాజీ ఇంచార్జ్ సభ్యులు ఎస్.కె.జిలానిమాలిక్, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,ఈపూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ గన్నామనేని వెంకయ్య పాల్గొన్నారు.
ఇంకా ఐ.టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తిరుమల శెట్టి బాలయ్య,నరసరావుపేట నియోజకవర్గం ఐ.టీడీపీ కోఆర్డినేటర్ అడుసుమల్లి అప్పారావు, నరసరావుపేట పార్లమెంట్ తెలుగు యువత అధికార ప్రతినిధి షేక్ రఫీ, నరసరావుపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు కోట నాగ సుదీర్, పార్లమెంట్ తెలుగు యువత కార్యదర్శి సాగర్, మైనార్టీ నాయకులు మన్నన్ షరీఫ్, ములకలూరు బాషా, తెలుగు మహిళా నాయకురాలు కనుమూరి లక్ష్మీ కూడా పాల్గొన్నారు.
వీరితో బాటు టీ.ఎన్.ఎస్.ఎఫ్.రాష్ట్ర షోషల్ మీడియా కోఆర్డినేటర్ ఘట్టమనేని గణేష్,టీ.ఎన్.ఎస్.ఎఫ్.రాష్ట్ర కార్య నిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రమ్మం, నరసరావుపేట పార్లమెంట్ టి.ఎన్.ఎస్.ఎఫ్.అధ్యక్షులు కూరపాటి హనుమంతరావు, టీ.ఎన్.ఎస్.ఎఫ్.నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు ఏనుగంటి భార్గవ సాయి, టీ.ఎన్.ఎస్.ఎఫ్.నరసరావుపేట నియోజకవర్గ ఉపాధ్యక్షులు మంచు వీరయ్య, ఉప్పుటూరి చక్రవర్తి, శివరామకృష్ణ, షేక్ కరిముల్లా, సాయి బాబు, శ్రీకాంత్, మరియబాబు, టి. ఎన్.టి.యు.సి. నరసరావుపేట పార్లమెంట్ కార్యదర్శి చంద్ర తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమ నిబంధనలను పాటించి.కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ప్రతి నిత్యం ప్రజా ఉద్యమాలు చేస్తూ కులమతాలకు, రాజకీయలకు,ప్రాంతలకు అతీతంగా నిత్యం ప్రజా శ్రేయస్సు కోసం పని చేసే చంద్రబాబు, లోకేష్ బాబు కరోన మహమ్మారి నుండి కోలుకుని ప్రజల సమస్యలపై పోరాడాలని. ఆ భగవంతుడు అంత మంచి చేయాలని ఆకాంక్షించారు. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం లోకేష్ బాబు జన్మదిన కేక్ ను కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.