వేల కోట్లు పెట్టి డివిజన్ ను అభివృద్ధి చేస్తున్నామని చెప్తున్న ఎమ్మెల్యే, కార్పొరేటర్ కు స్థానికంగా ఉండే సమస్యలు కనబడడం లేదా అని ప్రశ్నించారు బిజెపి సీనియర్ నాయకులు రవికుమార్ యాదవ్. శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఆల్విన్ కాలనీ డివిజన్ లలో గడపగడపకు బిజెపి కార్యక్రమంలో భాగంగా భూదేవి హిల్స్, తులసి నగర్, ఆల్విన్ కాలనీ ఫేస్ 1 పరిసర ప్రాంతాలలో సమస్యలపై పాదయాత్ర నిర్వహించారు. డివిజన్ లో చాలావరకు కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు రాలేదని స్థానిక వాసులు తమ దృష్టికి తీసుకొని వచ్చారని వెల్లడించారు. సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పార్టీ కృషి చేస్తుందని తెలిపారు.