గడపగడపకు కార్యక్రమంలో రాష్ట్రంలోనే పదో స్థానాన్ని సాధించిన ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డిని భవిష్యత్తులో మంత్రి పదవి వరించాలని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ఆకాంక్షించారు. ఇందుకూరుపేట మండలం, రాముడు పాలెం పంచాయతీ వెంకటేశ్వరపురం గిరిజన కాలనీలో కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి సోమవారం గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మరికొన్ని రోజుల్లో ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మొదటి స్థానాన్ని సాధిస్తారని పేర్కొన్నారు.
కోవూరు నియోజక వర్గం నుంచి మరో 2,3, సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై అందరి ఆదరాభిమానాలు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, వైసీపీ నేతలు కళ్యాణ్ రెడ్డి, బట్టేపాటి నరేంద్ర రెడ్డి, కోటేశ్వర్ రెడ్డి, అల్లాబక్షు, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్రెడ్డి, ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్యాహ్న భోజన కేంద్రాన్ని పరిశీలించి జాగ్రత్తగా నడపాలని హెచ్ఎమ్ కు, సిబ్బందికి సూచించారు.