రామతీర్థం రణరంగంగా మారింది.
గత అయిదు రోజుల నుంచీ కొండపై జరిగిన రాముడి విగ్రహం శిరస్సు ఘటనను అటు టీడీపీ ఇటు అధికార వైఎస్ఆర్ పార్టీ తమకనుకూలంగా మార్చుకున్న దరిమిలా బీజేపీ కూడా రంగంలో దిగింది.
నేడు బీజేపీ-జనసేనల బైక్ ర్యాలీ ధర్నాలతో మరోసారి నీలాచలం కొండ దద్దరిల్లిపోయింది. ఈ కార్యక్రమంలో భాగంగా అటువైపు వెళుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ను పోలీసులు అడ్డుకున్నారు.
చలో రామతీర్థం కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విశాఖ నుండి రామతీర్థం వెళ్లే ముఖ్య నేతలను పోలీసులు వారి ఇళ్ల వద్ద అడ్డుకున్నారు.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కు section 151 ప్రకారం నోటీసులు అందజేసి ఇంటి నుండి బయటకు రానివ్వలేదు. దీంతో ప్రభుత్వ చర్యల పై విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.