శుభ కార్యం అయినా అశుభం జరిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి మరణించిన గ్రామస్థాయి నాయకుడిని నేడు పరామర్శించారు.
ములుగు మండలం లోని అబ్బా పూర్ గ్రామానికి చెందిన చదువు రాంరెడ్డి తల్లి చదువు సౌందరమ్మ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు.
అప్పుడు రాలేకపోయిన సీతక్క దశ దిన కర్మ కు హాజరై చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,సర్పంచ్ గండి కుమార్ కల్పన,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,ఆత్మ డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి, పల్లె జయపాల్ రెడ్డి,వంగ రవి యాదవ్, మొడెం రాజమౌళి, అంకుస్,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు.