41.2 C
Hyderabad
May 4, 2024 16: 01 PM
Slider వరంగల్

బాధలో ఉన్న గ్రామస్థాయి నాయకుడిని పరామర్శించిన సీతక్క

#mla seetakka

శుభ కార్యం అయినా అశుభం జరిగినా నేనున్నానంటూ ముందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తల్లి మరణించిన గ్రామస్థాయి నాయకుడిని నేడు పరామర్శించారు.

ములుగు మండలం లోని అబ్బా పూర్ గ్రామానికి చెందిన చదువు రాంరెడ్డి తల్లి చదువు సౌందరమ్మ  ఇటీవలే అనారోగ్యంతో మరణించారు.

అప్పుడు రాలేకపోయిన సీతక్క దశ దిన కర్మ కు హాజరై చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్,సర్పంచ్ గండి కుమార్ కల్పన,ఎంపీటీసీ మవురపు తిరుపతి రెడ్డి,ఆత్మ  డైరెక్టర్ ఆకు తోట చంద్ర మౌళి, పల్లె జయపాల్ రెడ్డి,వంగ రవి యాదవ్, మొడెం రాజమౌళి, అంకుస్,మేడం రమణ కర్,తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముగిసిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడలు

Satyam NEWS

నెట్ ఫ్లిక్స్ మొదటి తెలుగు ఫిలిం పిట్ట కథలు

Sub Editor

ఏజెన్సీ ప్రాంత యువకులు అన్ని రంగాల్లో రాణించాలి

Murali Krishna

Leave a Comment