తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తున్నది. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి నిన్నకరోనా పాజిటీవ్ నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరొక అత్యంత దురదృష్టకరమైన విషయం ఏమిటంటే ఆయనతో పాటు మరో నలుగురికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
అందులోనూ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భార్య పద్మ లత కూడా ఉన్నారు. వారితో పాటు ఎమ్మెల్యే డ్రైవర్, గన్ మెన్, వంట మనిషి లకు కరోన పాజిటివ్ గా వైద్యులు నిర్ధారించారు. అదే విధంగా తెలంగాణా ఎస్సీ-ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గన్ మెన్ కు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయింది. దాంతో ఎర్రోళ్ల శ్రీనివాస్ హోం క్వారెంటైన్ కు పరిమితం అయ్యారు.