రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో ప్రజలు స్వచ్ఛందంగా ఐదు రోజుల పాటు లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. పట్టణంలో కరుణ కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నెల 17 వరకు స్వచ్ఛందంగా లాక్ డౌన్ వర్తక వాణిజ్య వ్యాపారస్తుల సంఘాలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నాయి.
పట్టణంలోని శ్రీకాంత్ కాలనీలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినందున కోవిడ్-19 కట్టడి నివారణకు అన్నిరకాల వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ వ్యాపార సంస్థలు మూసివేశారు.