27.7 C
Hyderabad
May 14, 2024 06: 50 AM
Slider నిజామాబాద్

కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టులు

#Congress Bichkunda

బిచ్కుంద మండలంలో ప్రాజెక్టుల నిర్మాణంలో అలసత్వం వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వ వైఖరికి నిరసనగా  కామారెడ్డి జిల్లా కేంద్రంలో జల దీక్షా కు బిచ్కుంద మండల నాయకులు తరలి వెళుతున్నారన్న సమాచారం మేరకు ఎనిమిది మంది పార్టీ సీనియర్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసినట్లు ఎస్సై కృష్ణ తెలిపారు .

ఈ సందర్భంగా నాయకులు విట్టల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని నిర్బంధ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు .

కెసిఆర్ నియంత పాలన కొనసాగిస్తూ అక్రమ ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారన్నారు .ప్రశ్నించకుండా ఉండేందుకే ప్రతిపక్షాలను ఎక్కడికి అక్కడ నిర్బంధించి నియంతలా వ్యవహరిస్తున్నారన్నారు .అరెస్టు అయిన వారిలో పార్టీ అధ్యక్షులు దర్పల్లి  గంగాధర్, సీనియర్ నాయకులు విఠల్రెడ్డి,గౌస్ ,పత్తి లింగు రామ్, బాలకృష్ణ ,ఎంపీటీసీ అవారి సురేష్ ఉన్నారు .

Related posts

బస్తీ దవాఖానాల ద్వారా ఉచిత వైద్య సేవలు

Murali Krishna

కంగ్రాట్స్: బెస్ట్ అవార్డు అందుకున్న ఖమ్మం సిపి

Satyam NEWS

కంటివెలుగు అమలు తీరుతెన్నులు భేష్

Bhavani

Leave a Comment