ఏలూరు జిల్లా పెదవేగి మండలం రామసింగవరంలో 104 వైద్య శిబిరం జరిగింది. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంచార వైద్య సేవ (104)పధకం ప్రజలకు మరింత చేరువ అవుతుంది. అందుకు నిదర్శనమే రామసింగవరం గ్రామంలో గురువారం జరిగిన ఈ శిబిరం.
ఈ శిబిరానికి గతామ ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది రోగులకు బి పి షుగర్, సాధారణ ఆరోగ్య సమస్యలు గుర్తించి ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ శిబిరం లో రూరల్ ఎం ఎల్ హెచ్ పి ధర్మవరపు జయ మాధురి, ఏ ఎన్ ఎం ప్రేమరాణి ఆశా వర్కర్ లు కనకదుర్గ, మౌనిక, 104 సిబ్బంది జి ప్రవీణ్ కుమార్, రవికుమార్ పాల్గొన్నారు.