శలవు రోజు, పంటగ పూట అని చూడకుండా ప్రజా సమస్యలపై నేడు ఉదయాన్నే పరిశీలనకు బయలుదేరారు ఎల్ బి నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. నేడు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ చైతన్య పురి డివిజన్ స్థానిక కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డి తో కలిసి మార్నింగ్ వాక్ చేశారు.
మూసీ రివర్ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా ఇటీవలే నియమితులైన సుధీర్ రెడ్డి ఈ మార్నింగ్ వాక్ లో మూసీ పరివాహక ప్రాంతాల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.ఏ.సుధీర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన కోసం వార్షిక బడ్జెట్ లో 10 వేల కోట్లు కేటాయించిందని, మూసీ పరివాహక ప్రాంత అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా మూసీ అభివృద్ధి ఖచ్చితంగా జరుగుతుందని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ బి. ఎల్. ఎన్.రెడ్డి, రెవెన్యూ అధికారి మాలతి, ఆర్కిటెక్ట్ వందన, స్థానిక టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.