రాష్ట్ర మంత్రి , యువనేత మేకపాటి గౌతమ్ రెడ్డి మృతిపై నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న గౌతమ్ రెడ్డి అకాల మృతి తనను ఎంతగానో కలచివేసిందని బాధను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమం చేపట్టినా దాన్ని ఒక క్రమపద్ధతిలో చేస్తూ గౌతమ్ రెడ్డి మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గం ఎంతగానో అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో అక్కడి ప్రజలకు తీరని లోటు అన్నారు. తనకు ఆయనతో ఎంతో ఆత్మీయత ఉందని, వ్యక్తిగతంగా తనకు ఎంతో లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
previous post