కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రం నుంచి సాయిబాబా భక్తులు ఆదివారం పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. మద్నూర్ సాయిబాబా మందిరం నుంచి నెమ్లీ సాయిబాబా మందిరం వరకు ముప్ఫై కిలోమీటర్లు పాదయాత్ర నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకు మద్నూర్ నుంచి బయల్దేరి సాయంత్రం ఆరు గంటలకు నెమ్లీ సాయిబాబా మందిరంకు చేరుకున్నారు. మేనూర్, మొఘ, డోంగ్లీ, కుర్ల, బీర్కూర్, మిర్జపూర్ లో గ్రామాలలో భక్తుల కోసం అన్న ప్రసాద వితరణ, టిఫిన్, టీ ఏర్పాట్లు చేశారు. దాతలకు ఆలయ కమిటీ తరఫున సన్మానించారు. ఈ కార్యక్రమంలో మద్నూర్ సర్పంచ్ దరాస్ సురేష్, ఉప సర్పంచ్ విఠల్ యాదవ్, భక్తులు పాల్గొన్నారు. కాగా ప్రతి సంవత్సరం పాదయాత్ర నిర్వహిస్తున్నామని భక్తులు తెలిపారు.
previous post