ప్రశాంత వాతావరణంలో పంచాయితీ ఎన్నికలు జరిగేందుకు తమ శాఖ పరంగా గట్టి బందోబస్తు చర్యలు తీసుకున్నట్ట విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారీ తెలిపారు.
కలెక్టరే్ట్ లో మీడియాతో మాట్లాడిన ఎస్పీ… పార్వతీపురం డివిజన్ పరిధిలో 114 సమస్యాత్మక, 58 అతి సమస్యాత్మక, 56 మావోయిస్టు ప్రభావిత, 10 గిరిశిఖర పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, అక్కడ ఎన్నికల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఫ్లాగ్ మార్చి నిర్వహించడం జరిగిందని, ప్రజలకు భరోసా కల్పించామన్నారు. ప్రత్యేకించి ఆయా గ్రామాల్లో పర్యటించి, ప్రజలతో సమావేశాలను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 16,950 మందిని బైండోవర్ చేశామని…. ఎన్నికల నేపథ్యంలో నిఘాను ముమ్మరం చేశామన్నారు.
అలాగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటివరకు సుమారు 200 కేసులను నమోదు చేశామని ఎస్పీ తెలిపారు.అదే విధంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన వారిని గుర్తించి వారిపై ఇప్పటివరకు 7 కేసులను నమోదు చేశామన్నారు.