29.7 C
Hyderabad
May 4, 2024 03: 29 AM
Slider వరంగల్

మున్నూరు కాపులు ఆశించే దశ నుండి శాసించే స్థాయికి చేరాలి

#munnuru kapu

మున్నూరు కాపులు ఆశించే దశ నుండి శాసించే స్థాయికి చేరుకోవాలని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ పిలుపునిచ్చారు. ములుగు జిల్లా మండల కో ఆర్డినేటర్ ల ఒక రోజు శిక్షణా శిబిరం ములుగు జిల్లా కేంద్రంలో  శుక్రవారం జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి పటేల్ అధ్యక్షతన నిర్వహించారు.

ఈ సమావేశానికి మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ సర్దార్ పుటం పురుషోత్తమ రావు పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మున్నూరు కాపులు గ్రామ గ్రామానా సంఘాలు పెట్టుకొని సంఘటిత శక్తిగా ఎదగాలని కోరుతూ బహుజనుల మద్దతు కూడా కూడగట్టుకోవాలని కోరారు. మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కొ కన్వీనర్ చల్ల హరి శంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులను సంఘటితం చేసే కార్యక్రమం ప్రణాళిక బద్దంగా రూప కల్పన చేసిందని అన్నారు.

ఇప్పటికే రాష్ట్రం లోని 119 నియోజకవర్గం కోఆర్డినేటర్ లను నియామకం చేసి నాగార్జున సాగర్ లో రెండు రోజులు శిక్షణ ఇచ్చామని తెలిపారు. 584 మండలాలకు మండల కోఆర్డినేటర్ లను నియమించి వారికి ప్రతి జిల్లా కేంద్రం లో శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి పటేల్ మాట్లాడుతూ కులం పై అభిమానం ఉండడం వేరని ఇతర కులాలపై ద్వేషం ఉండవద్దని అంటూ ఇతర కులాల ప్రేమను పొందాలని అన్నారు. జిల్లాలో పార్టీ లకు అతీతంగా గ్రామ గ్రామాన సంఘాలు ఏర్పాటు చేస్తాం అన్నారు.

ములుగు నియోజకవర్గం కోఆర్డినేటర్ పిట్టల మధుసుధన్ పటేల్ మాట్లాడుతూ ఇతర కులాలకు ఆదర్శంగా మున్నూరు కాపులు ఉండాలని కోరారు. ఈ సమావేశం లో భద్రాచలం నియోజకవర్గం కోఆర్డినేటర్ దానపనేని వేంకటేశ్వర్లు పటేల్,  రాష్ట్ర నాయకులు కోట్ల వినోద్ పటేల్, కాపు వికాసం అధినేత మాలి కరుణాకర్ పటేల్ మండల కో ఆర్డినేటర్స్ సిరికొండ బలరాం పటేల్ ,మిల్కురి ఐలయ్య పటేల్, తెళ్ళ హరిప్రసాద్ పటేల్,కందుకూరి సమ్మయ్య పటేల్, తోట శ్రీనివాస రావు పటేల్,పలిశెట్టి వెంకటేశ్వర్లు పటేల్, గుండెపుడి భాస్కర్ రావు పటేల్, సూరిబాబు పటేల్, షేర్ రాంబాబు పటేల్, సత్తిబాబు పటేల్, నారాయణ రావు పటేల్, సాంబశివరావు పటేల్, నాగేశ్వరావు పటేల్, హరిబాబు పటేల్, నాగభూషణం పటేల్, రామకృష్ణ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

ములుగు మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి పటేల్ మాతృమూర్తి స్వర్గీయ నల్లెల లచ్చవ్వకు మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ప్ర సర్దార్ధ పుటం పురుషోత్తమ రావు పటేల్ కొ కన్వీనర్ చల్ల హరిశంకర్లో పటేల్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.

Related posts

కోవిడ్ నిబంధనలు పాటించని ప్రైవేట్ కళాశాలలపై డేగ కన్ను

Satyam NEWS

322 మంది జ‌ర్న‌లిస్టుల‌ అక్రిడిటేష‌న్ల జారీకి క‌మిటీ ఆమోదం…!

Satyam NEWS

చైనా లో కడుపు పై మంట పెట్టి కొవ్వు కరిగిస్తారట

Satyam NEWS

Leave a Comment