బండారి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా హెచ్.బి కాలనీ ముస్లీమ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో లేకుండానే అడిగినవన్నీ అమలు చేస్తున్న బిఅర్ఎస్ పార్టీ కారు గుర్తుకు ఓటేసి, బండారి లక్ష్మారెడ్డినీ అత్యంత భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని అన్నారు. శుక్రవారం హౌసింగ్ బోర్డు కాలనీ, ముస్లీమ్ వెల్ఫేర్ అసోషియేషన్ తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తమకు పెద్ద మజీద్లో నమాజ్ చదువుటకు ఒక షెడ్డు ఏర్పాటు చెయ్యాలని, అర్హులైన మైనారిటీలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, మైనారిటీ బందు లక్ష రూపాయలు ఇప్పించాలని కోరారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డి సానుకూలంగా స్పందించి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తగు న్యాయం చేస్తానని ముస్లిం అసోసియేషన్ కు హామీ ఇచ్చారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా