ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగరవేయడం ఖాయమని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉప్పల్ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ గెలుపే లక్ష్యంగా కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాల, కెప్టెన్ వీర రాజు రెడ్డి పార్క్, రవీంద్ర నగర్, కాకతీయ నగర్ పార్క్ హబ్సిగూడ లో ప్రచారం నిర్వహించారు. ప్రభాకర్ వాకర్స్ తో మమేకమై వారి యోగక్షేమాలు తెలుసుకొన్నారు. కమలం పువ్వుకు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు , హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ , రాష్ట్ర నాయకులు డివిజన్ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా