రాష్ట్ర సర్కారు మటన్ క్యాంటీన్లను తెరిచేందుకు సిద్ధమైంది. ఇకపై సర్కారు వారి మటన్ క్యాంటీన్ తోపాటు గవర్నమెంట్ బిర్యానీ అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిష్ క్యాంటీన్ సక్సెస్ అయిన నేపథ్యంలో షీప్ ఫెడరేషన్ మటన్ క్యాంటీన్లు తెరిచేందుకు రెడీ అవుతోంది.
మాసబ్ ట్యాంక్ లోని షీప్ ఫెడరేషన్ స్టేట్ ఆఫీసులో మోడల్ గా చేపట్టిన మటన్ క్యాంటీన్ ఈ నెల రెండో వారంలో ఫెడరేషన్ సన్నద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా చేపట్టిన మటన్ క్యాంటీన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయి. సక్సెస్ ను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో క్యాంటీన్లు ఓపెన్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని షీప్ ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాల్రాజ్ యాదవ్ తెలిపారు.