26.7 C
Hyderabad
May 3, 2024 07: 38 AM
Slider గుంటూరు

బొందిలి సంఘం స‌త్రం స్థ‌లానికి భూమిపూజ‌

Bodili Sangam

నరసరావుపేట మండలంలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి దేవస్థానం వద్ద బొందిలి సంఘం అన్నదాన సత్రానికి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమం నిర్వ‌హించారు. నరసరావుపేట బొందిలి సంఘం అధ్యక్షులు క్షత్రి విజయ్ ప్రతాప్ సింగ్, కార్యదర్శి బొందిలి రామ్ బాలాజీ సింగ్, బాబీ సింగ్, కృష్ణ సింగ్, శివ సింగ్, పండరి బాయి,విశారద బాయి, కమలా బాయిల ఆధ్వర్యంలో శంకుస్థాప‌న చేశారు. అనంత‌రం సత్రానికి స్థలం కేటాయించి ఆదివారం శంకుస్థాపన చేసిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కి బొందిలి సంఘం తరుపున శాలువతొ సత్కరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ సందర్భoగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కోటప్పకొండ దేవస్థానం వద్ద అన్నదాన సత్రం ఏర్పాటు చేయ‌డం సంతోషకరమన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి బి.సి లకు పెద్ద పీట వేస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, అదే విధoగా కార్పోరేషన్లు ఏర్పాటు చేసి ఆయా సామజిక వర్గాలకు అన్నిరకాలుగా మేలు చేసే సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవస్తానం ఈ.ఓ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి, పార్టి నాయకులు మిట్టపల్లి రమేష్ తో పాటు బొందిలి సంఘం రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహేంద్ర సింగ్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి 23వ జాతర

Satyam NEWS

కిటకిటలాడుతున్న పశ్చిమగోదావరి శైవ క్షేత్రాలు

Satyam NEWS

ప్రాబ్లెమ్:మానేరు నిండా నీరు నీటి కోసం బోరు బోరు

Satyam NEWS

Leave a Comment