కలెక్టర్ గా ఉన్న ఇ. శ్రీధర్ను ఆకస్మికంగా బదిలీ చేసిన తర్వాత నుంచి ఇన్ చార్జి కలెక్టర్ పాలనలో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాకు కొత్త కలెక్టర్ రాబోతున్నారు. 2005 బ్యాచ్ కి చెందిన ఎల్ శర్మన్ ను నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
శర్మన్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ లో అదనపు కార్యదర్శిగా పని చేస్తున్నారు. ముక్కుసూటితనంతో నిజాయితీగా పని చేసే అధికారిగా శర్మన్ కు పేరు ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా కరోనా అదుపు చేయడం నుంచి ఎంప్లాయ్ మెంట్ గ్యారెంటీ స్కీమ్ వరకూ అన్ని అంశాలలో వెనుకంజ వేయడం వల్ల అధికారుల మార్పిడి జరిగింది. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడానికి శర్మన్ పూర్తి చొరవ చూపిస్తారని భావిస్తున్నారు.