తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్లను బదిలీ చేశారు. మొత్తం 15 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త పోస్టింగులు ఇవి: అడిషనల్ సీఈవో-జ్యోతి బుద్ధప్రకాష్, వైద్య ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి-సయ్యద్ అలీ ముర్తుజా రజీ,
అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా-శాంతికుమారి, ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్-అదర్ సిన్హా, నాగర్కర్నూల్ కలెక్టర్-ఎల్ శర్మన్, పాఠశాల విద్యా డైరెక్టర్-శ్రీదేవసేన హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్-వాకాటి కరుణ, పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి-కేఎస్ శ్రీనివాసరాజు, సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి-విజయ్కుమార్,
సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్-యోగితా రాణా, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జా కొనసాగింపు, ఆదిలాబాద్ కలెక్టర్-సిక్తా పట్నాయక్, పెద్దపల్లి ఇంచార్జ్ కలెక్టర్-భారతీ హోలీకేరి,
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి-ఇ. శ్రీధర్, కార్మిక, ఉపాధి కల్పనశాఖ కార్యదర్శి-రాణి కుముదిని దేవి, తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు పర్యావరణ శాస్త్ర సాంకేతిక అదనపు బాధ్యతలు రజత్కుమార్కు అప్పగింత.