గతంలో పట్టభద్రుల ఎంఎల్సీగా గెలిచిన బిజెపి రామచందర్ రావు,ఫ్రొఫెసర్ నాగేశ్వర్ పట్టబద్రులకు, ఉపాధ్యాయులకు, నిరుద్యోగులకు చేసింది ఏమి లేదని వనపర్తిలో తెలుగుదేశం నేతలు బోలేమోని రాములు, నందిమల్ల అశోక్ చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎమ్.ఎల్. సి అభ్యర్థి ఎల్. రమణను గెలిపించాలని పార్లమెంట్ అధ్యక్షుడు బోలేమోని రాములు, మాజీ అధ్యక్షుడు నందిమల్ల అశోక్ కోరారు.
వనపర్తిలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన,మంత్రిగా,పార్లమెంట్ సభ్యులుగా ఎటువంటి ఆరోపణలను లేకుండా నమ్ముకున్న సిద్ధాంతం కోసం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న ఎల్. రమణను గెలిపించి ప్రజావాణిని పెద్దల సభలో వినిపించే విధంగా పట్టభద్రులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ప్రజల్లో టి.ఆర్.ఎస్ కు ఉన్న వ్యతిరేకతను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని నిలపడానికి భయపడ్డారని అన్నారు.నీళ్లు,నిధులు,నియామకాలు అని చెప్పి అధికారంలోకి వచ్చిన కె.సి.ఆర్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసారని ఇంటికో ఉద్యోగం అని,నిరుద్యోగ భృతి అని విద్యార్థులను మోసం చేసారని,ఉపాధ్యాయులకు పి.ఆర్.సి 45 శాతం ఇస్తానని మోసం చేసారని విమర్శించారు.
రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా మోసం చేసారని,రాష్ట్రములో 2లక్షల 97వేల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోలేదని కాబట్టి విజ్ఞులైన పట్టభద్రులు కె.సి.ఆర్ కు బుద్దిచెప్పాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా కేంద్రం సి.బి.ఎస్ విధానం రద్దు చేయాలని,పెరిగిన పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలు 15సార్లు పెంచారని కాబట్టి బి.జె.పి అభ్యర్థిని కూడా ఓడించాలని అన్నారు.
బడుగు,బలహీన,హరిజన,గిరిజన,మైనారిటీ వర్గాలు ఏకమై ఎల్. రమణను గెలిపించాలని నందిమల్ల అశోక్,బి.రాములు కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర తెలుగు మహిళ ప్రధాన కార్యదర్శి నందిమల్ల శారదా,రాష్ట్ర యువత కార్యదర్శి రవి యాదవ్,కౌన్సిలర్ ఏర్పుల లక్మి, వాకిటి నారాయణ, డి.బాలరాజు,ఎం.బాలు,వహీద్ పాల్గొన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి