క్లీన్ అభ్యర్ధి విద్యాధికురాలు అయిన వాణిదేవిని రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని రాష్ట్ర ఆర్ధిక మంత్రి టి.హరీష్ రావు పిలుపునిచ్చారు.
మహబూబ్ నగర్,రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజక వర్గం అభ్యర్థి వాణి దేవి కి మద్దతుగా చేవెళ్లలో నేడు ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య,ఎమ్మెల్సీలు మహేందర్ రెడ్డి,శంబీర్ పూర్ రాజు,
ఎంపీలు రంజిత్ రెడ్డి, రంగారెడ్డి టీఆరెస్ పార్టీ ఇంచార్జ్ గట్టు రామచంద్రరావు ,జెస్పిటిసిలు ,ఎంపిపిలు ఇతర టీఆరెస్ ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు.