38.2 C
Hyderabad
April 29, 2024 14: 16 PM
Slider ఆధ్యాత్మికం

బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో అయ్యప్ప మహపడిపూజ

#padipuja

ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని  చర్లపల్లి డివిజన్ సిరి గార్డెన్స్ లో శుక్రవారం హైదరాబాద్ నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్,చర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవి యాదవ్ దంపతుల ఆధ్వర్యంలో అయ్యప్ప మహ పడిపూజ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ పుష్ప గిరి లక్ష్మీ నృసింహ స్వామి మరియు అర్చకులు శివ కార్తీక్ అర్చకుల బృందంచే  మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

స్వామి శరణం అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో మార్మోగింది. ఈ మహపడిపూజ మహోత్సవానికి పెద్దఎత్తున అయ్యప్ప స్వాములు, భక్తులు పాల్గొని అయ్యప్ప నామస్మరణం, పల్లకి సేవ,భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించిన అనంతరం బొంతు దంపతులు అయ్యప్ప భక్తులకు అల్పాహారం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రముఖ గాయకులు, గురు స్వామి జంగిరెడ్డి గారి బృందం స్వామి వారి పాటలతో అందరినీ అలరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్, కార్పొరేషన్ చైర్మన్లు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్,సతీష్ రెడ్డి, కార్పొరేటర్లు స్వర్ణ రాజ్, బన్నాల గీత ప్రవీణ్,నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ కార్పొరేటర్లు, గొల్లురీ అంజయ్య,గంధం జ్యోత్స్న నాగేశ్వర్ రావు,మేకల హన్మంతు రెడ్డి,భారాస నాయకులు ధర్మేందర్ రెడ్డి, గుడాలభాస్కర్,రమేష్,డివిజన్ నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

నేడు పీఎం డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ స్కీమ్‌ ప్రారంభించనున్న మోడీ

Sub Editor

ప్రధాన మంత్రి గ్రామీణ యోజన అమలుకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS

ఉపాధ్యాయులు ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి

Satyam NEWS

Leave a Comment