37.7 C
Hyderabad
May 4, 2024 14: 59 PM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి

#CPI Narayana

నీటి విషయాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతి సీపీఐ కార్యాలయం లో ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

నీటి సమస్య లను సామరస్యంగా పరిష్కరించుకోవాలి తప్ప రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని ఆయన కోరారు. తెలుగు రాష్ట్రాల మధ్య చెలరేగిన నీటి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఆయన తెలిపారు.

భారతదేశంలో రాజకీయ మార్పు రాబోతోందని ఆయన అన్నారు. దేశంలో థర్డ్ ఫ్రంట్ బలపడుతోందని, శరద్ పవార్  థర్డ్ ఫ్రంట్ నడిపిస్తాడని ఆయన తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బిజెపి ఓటమి ఖాయం గా కనిపిస్తున్నదని నారాయణ తెలిపారు. భారత దేశానికి మోడీ అసమర్థ  ప్రధాని, కార్పొరేట్ సంస్థలతో మోడీ లాలూచీ పడ్డారని నారాయణ తెలిపారు.

పెట్రోల్, డీజిల్ ను జిఎస్టీ పరిధిలో ఎందుకు చేర్చడం లేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఆర్.ఎస్.ఎస్.ను మించిన టెర్రరిస్టులు లేరని నారాయణ వ్యాఖ్యానించారు. బిజెపిని ప్రశ్నిస్తే దేశద్రోహం, అక్రమ కేసులు పెడుతున్నారు.

Related posts

ఘ‌నంగా ఇందిరాగాంధీ 103వ జ‌యంతి

Sub Editor

బీజేపీ, బీఆర్ఎస్ లను తిరస్కరించాలి: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Satyam NEWS

‘ఊర్వశి’ విడుదల: ఎమోషనల్ థ్రిల్లర్ ‘బాలమిత్ర’

Satyam NEWS

Leave a Comment