మాజీ దివంగత ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ కమిటీ కడప అధ్యక్షులు నీలి శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో రిమ్స్ వద్ద ఉన్న ఇందిరమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నీలి, నగర అధ్యక్షులు విష్ణుప్రీతమ్రెడ్డిలు మాట్లాడుతూ ఇందిరమ్మ నిరంతరం పేద, బడుగు, బలహీన వర్గాల కోసం శ్రమించారన్నారు. గరీబీ హఠావో నినాదంతో దేశంలోని ప్రజలకు కనీసావసారాలైన కూడు, గుడ్డ, ఇల్లు సమకూర్చేందుకు తీవ్రంగా పాటుపడ్డారన్నారు. ఇక అంతరిక్ష ప్రయోగాలలో విదేశాల సరసన భారత్ను నిలిపిన ఘనత కూడా ఆమెకే దక్కుతుందన్నారు. పాకిస్థాన్కు బుద్దిచెప్పారని, రాజాభరణాలు రద్దు చేశారని 16 సంవత్సరాలు దేశ ప్రధానిగా సేవలందించిన ఏకైక మహిళ ఇందిరమ్మ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో వెంకటరమణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా తిరుమలేష్, కోవూరి శ్రీనివాసులు, సాదిక్ అలీఖాన్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య, ఖాదర్ ఖాన్, అలీఖాన్, సిరాజుద్దీన్, ఆసీఫ్ ఖాన్, గోర్ల శ్రీనివాసులు, కుళాయప్ప, ఖయ్యూం, మామిళ్ల నరసింహులు, సూర్యుడు, పుల్లయ్య, లావణ్య, బాబు, శ్యామ్, చరణ్, షఫీవుల్లా, సురేంద్రబాబు, అబ్దుల్ రౌఫ్, నసీమ్ సుల్తానా తదితరులు పాల్గొన్నారు.