నీట్, జేఈఈ-2022 ప్రవేశ పరీక్షలు రాయాలనుకుంటున్న విద్యార్థుల కోసం ‘కోటా’ స్టడీ మెటీరియల్ సిద్ధం చేసినట్టు ఐఐటీ-జేఈఈ, నీట్ ఫోరం వెల్లడించింది. ఈ మేరకు ఆ ఫోరం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గ్రాండ్ టెస్టులు, సొల్యూషన్, రాపిడ్ నోట్స్, మాక్ టెస్టులు, వీడియో లెక్చర్స్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, మాడ్యూల్స్ను సిద ్ధం చేసినట్లు పేర్కొంది. ఎడ్యుగ్రామ్ డిజిటల్ 360 సహకారంతో నీట్, జేఈఈ డిజిటల్ పీడీఎఫ్ మొబైల్ వెర్షన్ రూపంలో ప్రిపరేషన్, ప్రాక్టీస్ కోసం వాటిని సిద్ధం చేశామని వివరించింది. విద్యార్థులు పరీక్షలో ప్రతిభ కనబర్చేందుకు ఉపయోగపడుతాయని పేర్కొంది.మరింత సమాచారం కోసం నీట్ వారు NEET 2022, జేఈఈ వారు JEE 2022 అని టైపు చేసి 98490 16661 వాట్సాప్ మెసేజ్ చెయ్యాలని ఫోరం సూచించింది.