సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించి ఆర్టీసీ టిక్కెట్ ధరలను మాత్రం అమాంతం పెంచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అన్ని రకాలుగా దెబ్బలు పడుతూనే ఉన్నాయి. సినిమా ధియేటర్లు మూతపడి ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుండగా ఆర్టీసీ చార్జీలు పెంచి సొమ్ము చేసుకుందామనుకున్న ప్రభుత్వానికి అందులోనూ నిరాశే ఎదురయ్యేలా కనిపిస్తున్నది. సంక్రాంతి సమయంలో.. ఏపీలో ఆర్టీసీ… టిక్కెట్ల ధరలను పెంచింది. కానీ తెలంగాణ ఆర్టీసీ మాత్రం ఛార్జీలు పెంచలేదు. కాబట్టి ఏపీకి వెళ్లే ప్రయాణికులు అందరూ తెలంగాణ ఆర్టీసీలో టికెట్లు బుక్ చేసుకోండి..డబ్బులను ఆదా చేసుకోండి అంటూ టిఎస్ఆర్ టిసి ఎండి విసి సజ్జనార్ ప్రయాణీలకును కోరారు. ఏపిఎస్ ఆర్టీసీ టిక్కెట్ డబ్బులు పెంచినా ప్రయాణీకులు మాత్రం ఎగువగా టీఎస్ ఆర్టీసీ బస్సులే ఎక్కే అవకాశం కనిపిస్తున్నది. ఇదే జరిగితే ఏపిఎస్ ఆర్టీసీకి నిరాశ తప్పదు.
previous post