నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ‘గడపగడప’లో చిరునవ్వులు ఎదురయ్యాయి. కందుకూరు డివిజన్లోని కరేడు పంచాయతీ, మర్రిచెట్టు సంఘం ఎస్టీ కాలనీలో బుధవారం కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి తో కలిసి ‘గడపగడప’కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ‘గడపగడప’కు వెళ్లి లబ్ధిదారులను ప్రశ్నించారు. వారికి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగారు.
దానికి వారు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని, అన్ని పథకాల లబ్ధి చేకూరుతోందని సమాధానమిచ్చి చిరునవ్వులు చిందించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి స్థానిక నేతలను పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, కోటేశ్వర్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.