విజయనగరం నగర పాలక సంస్థ నూతన కమిషనర్ గా ప్రేమ ప్రసన్న వాణి బాధ్యతలు స్వీకరించారు. ఇంతవరకు ఉన్న కమిషనర్ ఎస్ ఎస్ వర్మ ఆమెకు బాధ్యతలను అప్పగించి…. పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందలు తెలియజేసారు. అదేవిధంగా పలు విభాగాల అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు ఇచ్చి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కొత్త లేడీ కమీషనర్ తొలిసారిగా మీడియాతో ఇంగ్లీషు లో మాట్లాడారు.
నగరంలో అభివృద్ధి పనులతో పాటు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అమలకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు, పారిశుద్ధ్య పరంగా మెరుగుపరిచేందుకు, విద్యాపరంగా మెరుగైన ఫలితాలు సాధించేందుకు తనవంతు కృషి చేస్తానని తెలిపారు. ఎప్పటికప్పుడు సిబ్బందితో సమీక్షలు జరిపి అవసరమైన చర్యలు చేపడతానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఈ డా.కిల్లాన దిలీప్, పలువురు డిఈలు, మేనేజర్ ప్రసాద్, నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.