చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లను నిన్న దొంగల ముఠాగా అభివర్ణించిన ముఖ్యమంత్రి జగన్ నేడు మరో అడుగు ముందుకు వేశారు. ‘‘ నా వెంట్రుక కూడా పీకలేరు’’ అంటూ ఆయన అతి దారుణంగా మాట్లాడారు. దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకొన్న ఖర్మ…అంటూ ఆయన హద్దు దాటి మాట్లాడారు.
దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో… ఈ స్థానానికి వచ్చా… వీళ్ళందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు… అని నంద్యాలలో సంచలన వ్యాఖ్యలు చేసారు ఏపి సీఎం వైఎస్ జగన్. ముఖ్యమంత్రి చేస్తున్న ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. ముఖ్యమంత్రి ఎందుకో అసహనానికి గురి అవుతున్నారని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఆయన విశ్వాసానికి ప్రతిరూపమని మరి కొందరు చెబుతున్నారు. ఏది ఏమైనా నా వెంట్రుక కూడా పీకలేరు అనే వ్యాఖ్యలు మాత్రం ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయదగినవి కాదని అంటున్నారు.