భరత్ నగర్ లో బాగ్ అంబర్ పేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. జిహెచ్ ఎంసి ఎన్నికల సందర్బంగా బాగ్ అంబేర్పేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ బాగ్ అంబేర్పెట్ డివిషన్ లో భరత్ నగర్, తదితరల ప్రాంతాలలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ప్రజలు ఎదురుకుంటున్నసమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా డివిజన్ లో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను ప్రజలు ఉషశ్రీ దృష్టికి తీసుకువచ్చారు. ఉషశ్రీ మాట్లాడుతూ డివిజన్ లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నానని, వాటి పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఎళ్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని సమస్యలను పరిష్కరించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీని అత్యదిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో అనిత, భానుప్రియ, వరలక్ష్మి, శ్రీదేవి, సుష్మ, సరిత తదితరులు పాల్గొనగా, అధిక సంఖ్యలో మహిళలు,కాంగ్రెస్ పార్టీ నాయకులు హాజరయ్యారు.