38.2 C
Hyderabad
May 3, 2024 22: 46 PM
Slider హైదరాబాద్

న్యూ శాంతినగర్ సమగ్ర అభివృద్ధికి కృషి

#newsantinagar

న్యూ శాంతినగర్  సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ మందముల రజిత పరమేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. న్యూ శాంతినగర్ లో రోడ్లు, డ్రెయినేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో ఆధునీకరణ కు శనివారం కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి, ఏఈ వసంత  అధికారులతో కలిసి న్యూ శాంతి నగర్ లో విస్తృతంగా పర్యటించారు.

న్యూ శాంతినగర్ సమస్యలు పునరావృతం కాకుండా ఉండేలా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు కార్పొరేటర్ ఆదేశించారు. కార్యక్రమంలో కాలనీ  అధ్యక్షులు లఖన్, తుమ్మల దేవి రెడ్డి, గంట చందు, వెంకటేష్,  బతిని సత్తయ్య, ధనమ్మ, జ్యోతి, లక్ష్మీ, యాదమ్మ, హేమలత, ఉపేంద్ర, భవానీ, శేఖర్, నవీన్,  వీరయ్య ,వెంకటేష్ ,చారి ,కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

జూనియర్ పుట్టిన రోజున పేదలకు ఎగ్ బిరియాని

Satyam NEWS

మన  ఘన  వారసత్వం

Satyam NEWS

ఆర్కేపురంలో కొనసాగుతున్నటీఆర్ఎస్‌ ప్రచారం!

Sub Editor

Leave a Comment